ఎన్నారై ఫిర్యాదును గాలి కొదిలేసిన విజయవాడ పోలీసులు

విజయవాడలో తన తల్లితండ్రులుంటున్న కాలనీ వద్ద అరాచకం పెరిగిపోయి అక్కడ నివసిస్తున్నకుటుంబాలకు అభద్రత కలుగుతూ ఉందని ఒక ఎన్నారై బుద్ధిగా విజయవాడలపోలీసుకు ఫిర్యాదు చేశాడు.  గంజాయి విచ్ఛలవిడిగా వాడుతూ ఉండటం, కొంత మంది పెద్ద మనుషులనే వాళ్లు పేకాట క్లబ్బు నిర్వహిస్తూ ఉండటం, వ్యభిచారాన్ని నడుపుతూఉండటం వంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలు సాగుతున్నాయని ఆయన ఆప్రాంత ఎసిపికి మొదట, ఆర్వాత కమిషనర్ కు ఫిర్యాదు చేశాడు. ఈ కార్యకలాపాల వెనక ఎవరున్నారో కూడా ఆయన పోలీసులకు వెల్లడించారు. అయినా  సరే పోలీసులు చర్యలు తీసుకొనకపోవడం పట్ల విజయవాడకు చెందిన ఎన్నారై అవక్కాయ్యారు. ఇక లాభం లేదనుకుని ఆయన తన కాలనీవాసుల బాధలను వీడియో ద్వారా సోషల్ మీడియాకెక్కించారు. ఇపుడైనా విజయవాడ పోలీసు కమిషనర్లో , ఆ ప్రాంత ఎసిపిలో చలనం వస్తుందేమోనని ఆశిస్తున్నాడు. ఇదే ఆయన వీడియో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *