నన్ను చంపాలని చూస్తున్నారు

 తనను చంపడానికి తెలంగాణ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఈకుట్రని  అమలు పరచే భాధ్యతను ఒక మంత్రి,ఒక ఎమ్మెల్యే కు అప్పచెప్పిందని ఎంఆర్ పి ఎస్ నాయకుడు మంద కృష్ణ తీవ్రమయిన ఆరోపణ చేశారు.

ఆయన  చెప్పిన వివరాలు

‘‘సూర్య పెట్ నుండి జులై లో ఒక కారు నన్ను వెంబడించింది అని రెండు పీఎస్ లలో పిర్యాదు చేశాను కానీ ఆ కారులో ఎవరు వెంబడించింది అనేది ఇంతవరకు గుర్తించ లేదు. నన్ను  చంపడానికి ప్రయత్నించిన విషయం నాకు తెలిసింది. ఈ విషయం మంత్రికి తెలియడంతో దానిని  ప్రభుత్వం విరమించుకుంది. అతి త్వరలో వారి పేర్లు కూడా బయటపెడతనుప్రజాస్వామ్యంలో ప్రశ్నించడమే నేరమా. నేను చావడానికైనా సిద్ధమే కానీ ఇంత దారుణంగా ప్రవర్తించడం ఏమిటి?’’

ఈ నెల 13న తలపెట్టిన బందును విజయవంతం చేయవలసిందిగా ఆయన ప్రజలను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *