మార్చి17 వస్తున్నాడు “మనసైనోడు”

మనోజ్ నందన్, ప్రియసింగ్ హీరో హీరోయిన్ గా   తెరకెక్కిన “మనసైనోడు” ఈ నెల 17న రిలీజ్ అవుతున్నది. హెచ్. పిక్చర్స్ పతాకం పై హసీబుద్దిన్ నిర్మాతగా, సత్యవరపు వెంకటేశ్వరరావుని దర్శకుడిగా పరిచయం చేస్తు నిర్మించిన చిత్రం “మనసైనోడు”. ఇటీవలే ఈ చిత్రo సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకోవడంతో  ఈ నెల 17న రిలీజ్ ముహూర్తం నిర్ణయించారు.

యువతీ యువకులు స్నేహంలో ఉన్నప్పుడు, ప్రేమ లో ఉన్నప్పుడు వాళ్ళ మధ్య వచ్చే  భావోద్వేగాలను కధలో జోడించి,మంచి మెసేజ్ పాటు దేశభక్తిని యువకుల్లో రేకెత్తించే విధంగా  “మనసైనోడు” తయారైందని నిర్మాత తెలిపారు.ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా రూపొందించామని దర్శకుడు తెలియజేశారు.

ఈ చిత్రం లో పోసానికృష్ణమురళీ,రఘుబాబు,గిరిబాబు,
కేదార్ శంకర్,గుర్రాజు,వేణుగోపాల్,అనంత్,చేతన్య,శశాంక, సంగీత, మధుమని, జ్యోతి,దివ్యశ్రీగౌడ తదితరులు నటిస్తున్నారు.కెమెరా: సురేంద్రరెడ్డి, ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్, మ్యూజిక్: సుభాష్ ఆనoద్, పాటలు: డా.సి. నారాయణ రెడ్డి,భాస్కరబట్ల,గోసాల రాంబాబు,పూర్ణాచారి
నిర్మాత: హసీబుద్దిన్, కధ,మాటలు,స్క్రీన్ ప్లే,దర్శకత్వం : సత్యవరపు వెంకటేశ్వరరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *