యంపి మాగంటి బాబుకు గుండెపోటు

తెలుగు దేశం లో క్ సభ సభ్యుడు మాగంటి బాబుకు గుండెపోటు వచ్చింది, ఆయనను వెంటనే విజయవాడ రమేష్ హాస్పిటల్ కు తరలించారు. వివరాలు అందాల్సి ఉంది.

శుక్రవారం ఉదయం చింతలపూడిలో టీడీపీ నిర్వహించిన సైకిల్ యాత్రలో ఎంపీ మాగంటి బాబు పాల్గొన్నారు. సైకిల్ యాత్ర పూర్తయ్యాక ఆయన ఇంటికి కూడా చేరుకున్నారు. అప్పటి దాకా ఆయన బాగానే ఉన్నారు. తర్వాత  ఆయన అస్వస్థతకు లోనయ్యారని తెలుస్తోంది. గుండెపోటు వచ్చిందని  కొందరు చెబుతున్నారు. కుటుంబసభ్యులు ఆయనను చికిత్స నిమిత్తం ఏలూరులోని ఆస్పత్రికి తరలించారు. మాగంటిని పరీక్షించిన వైద్యులు ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించినట్లు ఇప్పటి  సమాచారం.

తాజా వివరాలు అందగానే  అందిస్తాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *