నారా లోకేష్ కు ‘డిజిటల్ లీడర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డ్…

అమరావతి:ఆంధ్రప్రదేశ్ ఐటి పంచాయతీ రాజ్ మంత్రి నారా లోకేష్ కు అరుదైన గౌరవం లభించింది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాల అమలుకు వినియోగిస్తున్న అధునాతన టెక్నాలజీ,డ్యాష్ బోర్డ్ ఏర్పాటు ఆధారంగా బిజినెస్ వరల్డ్ మ్యాగ్జైన్  సర్వే చేసి డిజిటల్ లీడర్ అఫ్ దిఇయర్ అవార్డుకు లోకేష్ ను ఎంపిక చేసింది.

పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల్లో వివిధ కార్యక్రమాల అమలుకు లోకేష్ నాయకత్వంలో అధునాతన సంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరిపాలనను సులభతరం చేస్తున్న సంగత తెలిసిందే. ఈ ప్రయోగాలను పరిశీలించాకే  బిజినెస్ వరల్డ్ మ్యాగ్జైన్ ఈ అవార్డుకు లోకేష్ ను ఎంపిక చేసింది.

ఈ నెల 18 వ తారీఖు సాయంత్రం ఢిల్లీలో బిజినెస్ వరల్డ్ డిజిటల్ ఇండియా సమ్మిట్ లో ‘డిజిటల్ లీడర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డ్’ లోకేష్ అందుకుంటారు.

గ్రామీణ నీటి సరఫరా శాఖకు మరో అవార్డ్  ప్రకటించారు.

జలవాణి,గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా కోసం వినియోగిస్తున్న అధునాతన
ట్రాకింగ్ సిస్టమ్ కు మరో అవార్డ్ ను ఆయనకు అందుకుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *