ఘటన జరగడం దురదృష్టకరం -ఎల్జీ పాలిమర్స్

గ్యాస్ లీక్ ఘటనపై ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం స్పందించింది. ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరమని పేర్కొంది. ఘటనపై సాంకేతిక నిపుణులు, ప్రభుత్వంతో కలిసి విచారణ జరిపిస్తామంది.

బాధితులను ఆదుకునేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడంతోపాటు బాధితుల మెడికల్ అవసరాల కోసం కమిటీ ఏర్పాటు చేస్తామని పేర్కొంది.

పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని తెలిపిన యాజమాన్యం ప్రజలను ఆందోళన చెందవద్దని కోరింది. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చింది. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.