గుడివాడకు రౌడీల ముప్పు, కాపాడుకుందాం రండి, కొడాలి నాని పిలుపు

గుడివాడలో హింసా రాజకీయాలను ప్రోత్సహిస్తే సహించేది లేదని కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం వైఎస్ ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి కొడాలి నాని హెచ్చరిక చేశారు.

గుడివాడలో రౌడీ ఇజం, గుండాయిజం, హత్యారాజకీయాలు లేకుండా ఉండాలంటే, తెలుగుదేశం అభ్యర్థి దేవినేని అవినాష్ ను ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి తరమాలిని ఆయన పిలుపు నిచ్చారు.

ఈ రోజు ఆయన ఎన్నికల ప్రచారం చేస్తూ  ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తీవ్రంగా విమర్శించారు.

‘‘గుడివాడ పట్టణానికి విద్యలో మంచి పేరుంది . నర్సరీ నుండి ఇంజనీరింగ్ కాలేజ్ వరకు ఇక్కడికి రాష్ట్ర ఇతర ప్రాంతాల నుండి కూడా విద్యార్దులు వస్తున్నారు. విజయవాడ లో విద్యార్ది సంఘం స్థాపించి కుల తత్వం ప్రోత్సహించి హత్యా రాజకీయాలు చేసి విద్యార్దులు భవిష్యత్తు నాశనం చేసిన దేవినేని నెహ్రూ కుమారుడు దేవినేని అవినాష్ ను తెలుగుదేశం పార్టీ గుడివాడ తీసుకుని వచ్చింది. ఇక్కడ అటువంటి రాజకీయాలు చేస్తామంటే ఎవరూ ఒప్పకోరు. అటువంటి అరాచకాలు చేసే రాజకీయ నాయకులకు ఈ గుడివాడ లో స్దానం లేదు.’’ కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం లో 27,28,29,వార్డు లలో వైసిపి అభ్యర్ధిగా ఎన్నికల ప్రచారం చేస్తూ నాని ఈ హెచ్చరిక చేశారు.

ఆయన అభిమానులు  క్రేన్ సహాయం తో భారీ గజమాలతో కొడాలి నానిని సత్కరించారు.

ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడిన కొడాలి నాని ఈహెచ్చరిక చేశారు.
‘అంగ బలం,అర్దిక బలం కోసం విద్యార్దులు ను సంఘం లో అరాచక శక్తులను తయారు చేసి తల్లిదండ్రులు కి కడుపుకొతకు గురి చేయ్యాటానికి కూడా వెనకాడనటువంటి వ్యక్తి దేవినేని అవినాష్. అటువంటి వ్యకి కి సమాజంలో బాధ్యత కలిగిన తల్లిదండ్రులు ,విద్యార్దులు  తగిన బుద్ది చెప్పి ఎక్కడ నుండి వచ్చారో అక్కడ కు పంపించాలని,’ అని  కోరారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *