`ఐతే 2.0` సాంగ్‌ విడుదలయింది

(మానేపల్లి రాంబాబు)

ఐతే 2.0 పాట కింద ఉంది.


`ఐతే 2.0` సాంగ్‌ను విడుద‌ల చేసిన ఎం.ఎం.కీర‌వాణి

ఈ సందర్భంగా కీర‌వాణి మాట్లాడుతూ – “సాంగ్ విన్నాను. చాలా కొత్త‌గా అనిపించింది. ఈ సినిమాకు సంగీతం అందించిన అరుణ్ చిలువేరు అద్భుత‌మైన మెలోడి మ్యూజిక్‌ను అందించ‌గ‌ల‌రు. త‌ను గిటారిస్ట్‌గా ప‌నిచేస్తున్న‌ప్ప‌ట్నుంచి నాకు తెలుసు. ట్యూన్ చాలా బావుంది. `ఆశ‌గా ఆశ‌కే ఆయువు పెంచ‌గా..` వంటి సాహిత్యం ఇన్‌స్పైరింగ్‌గా ఉంది. న‌రేశ్ అయ్య‌ర్ పాట‌ను చాలా చ‌క్క‌గా పాడాడు. సినిమాలోని మిగిలిన రెండు పాట‌లు కూడా శ్రోత‌ల‌ను ఆక‌ట్టుకుంటాయ‌నే న‌మ్మ‌కం ఉంది. ఎంటైర్ యూనిట్‌కి ఆల్ ది బెస్ట్‌“ అన్నారు.

క‌ల్యాణ్ మాలిక్ మాట్లాడుతూ – “`ఐతే`సినిమాకు నేనే మ్యూజిక్ కంపోజ్ చేశాను. ఆ సినిమాలో ఒకే ఒక సాంగ్ ఉంటే.. దాన్ని అన్న‌య్య కీర‌వాణిగారు పాడారు. ఇప్పుడు అన్య‌య్య‌తో క‌లిసి `ఐతే 2.0` సాంగ్ రిలీజ్ చేయ‌డం ఆనందంగా ఉంది. అరుణ్ నా మ్యూజిక్ టీంలో గిటారిస్ట్‌గా ప‌నిచేశారు. త‌న‌తో ప‌నిచేయ‌డం కూల్‌గా ఉంటుంది. `ఐతే` సినిమాలాగానే ఈ సినిమా కూడా పెద్ద హిట్ సాధించాలి“ అన్నారు.

ఇంద్రనీల్‌ సేన్‌గుప్తా, జారా షా, అభిషేక్‌, కర్తవ్య శర్మ, నీరజ్‌, మృణాల్‌, మృదాంజలి కీలక పాత్రధారులుగా రాజ్‌ మాదిరాజు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఐతే 2.ఓ’. ఫర్మ్‌ 9 పతాకంపై కె.విజయరామారాజు, హేమంత్‌ వల్లపురెడ్డి నిర్మిస్తున్నారు. మార్చి 16న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సినిమాలో `నింగిపై…` అనే పాట‌ను ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి విడుద‌ల చేశారు. ఈ కార్య్ర‌క‌మంలో ఇంకా క‌ల్యాణ్ మాలిక్‌, చిత్ర ద‌ర్శ‌కుడు రాజ్ మాదిరాజు, సంగీత ద‌ర్శ‌కుడు అరుణ్ చిలువేరు, న‌రేశ్ అయ్య‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *