విభజనకు ప్రధాన కారణం జగనే –అంటున్నదెవరో కాదు జలీల్ ఖాన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి యే కారణమని టిడిపి ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఝలక్ ఇచ్చారు. ఈ రోజు ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ జగన్ మీద విరుచుకుపడ్డారు.

తాను చెప్పేది అల్లాటప్పకాదు, అక్షర సత్యం అని కూడా వార్నింగ్ ఇచ్చారు.

‘‘విభజనకు ప్రధాన కారణం జగనే. ఆయనను బూచీగా చూపి సోనియాను విభజనకు ఒప్పించారు,’’ అని జలీల్ ఖాన్ అన్నారు.

జలీల్ ఖాన్ చెప్పిన ‘అక్షర సత్యాలు’  ఇవే.

‘చంద్రబాబు నాలుగేళ్లు వృధా చేశారని అంటున్న వారు వాస్తవాలు గుర్తించాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు దమ్ము గురించి మాట్లాడే అర్హత కూడా జగన్ కు లేదు. మోడి మోసం చేశారని తెలిసిన వెంటనే ధైర్యంగా బయటకు వచ్చిన మగాడు చంద్రబాబు,’ అని ఖాన్ అన్నారు.పాదయాత్ర వల్ల హోదా తీసుకురాగలవా అని జగన్ ను ప్రశ్నిస్తూ మోడిని ఒక్క మాట అయినా అడిగావా అన్నారు.  కేవలం కేసుల నుంచి తప్పించుకునేందుకు రెండో ముద్దాయిగా ఉన్న విజయసాయి రెడ్డి ని మోడి చుట్టూ తిప్పుతున్నాడని విమర్శించారు.

ఇంకా ఏమన్నారంటే…

**టిడిపి అనేక సంక్షేమ పధకాలు అమలు చేసినా, రైతులకు రుణమాఫి చేసినా కళ్లుండి వైసిపి నేతలు గుడ్డిగా వ్యవహరిస్తున్నారు

**వచ్చే ఎన్నికలలో టిడిపి మూడో స్థానంలో ఉందని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు

**వచ్చే పదేళ్లు చంద్రబాబే సిఎం, జగన్ కలలు కల్ల కావడం ఖాయం

**తండ్రి చనిపోయాడనే బాధ కూడా లేకుండా సిఎం కుర్చీని ఆశించిన ఘనుడు జగన్

**కొంతకాలం ఆగమని సోనియా కోరినా పదవి కోసం రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ నే నాశనం చేశాడు

**జగన్, పవన్ లు ఎవరో రాసిన స్క్రిప్ట్ లను చూసి మాట్లాడుతున్నారు

**అవగాహన లేని అటువంటి వారు సిఎం లు అయితే ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అంతా ఆలోచించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *