పుట్టుక చావు టిఆర్ ఎస్ లోనే…

తెలంగాణ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు కు కోపం వచ్చింది. దానికి కారణం,సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన ఒక పోస్ట్.దీని ప్రకారం, హరీష్ రావు 40 మంది ఎమ్మెల్యేలతోకలసి బిజెపిలో చేిపోతున్నడు. దీని మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి పోలీసు డిజిపి కి ఫిర్యాదుచేసి చర్యలు తీసుకోమని చెప్పారు. ఎందుకంటే,ఈ పోస్టులో చూపెట్టిన చానెల్ ఇలాంటి వార్తను ప్రసారం చేయనే లేదట.

ఇదే పోస్టింగ్…

ఎబిఎన్ ఆంధ్ర జ్యోతి చానెల్ ను అడ్డం పెట్టుకుని ఈ పోస్ట్ తయారైంది.  ఎవరైనా చూస్తే ఈ చానెల్ నిజంగానే ఈ న్యూస్ ప్రసారం చేసిందనుకుంటారు. కాని మొత్తం మార్ఫింగే. మిస్ఛీఫ్. దీనిని హరీష్ రావు ఏమంటున్నారో చూడండి.

నా పుట్టుక చావు టీఆర్ఎస్ పార్టీతోనే

అనేక సార్లు ఇదే విషయంపై స్పష్టత ఇచ్చాను

మా నాయకుడు కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి ఉంటా

సోషల్ మీడియా లో నాపై వస్తున్న వార్తలను ఖండిస్తున్న

దీనిపై డీజీపికి ఫిర్యాదు చేశాను

పోస్టింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనీ కోరాను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *