గోదావరి లాంచి ట్రాజెడీ… తాజా సమాచారం (video)

గోదావరి నదిలో నిన్న దేవీ పట్నం దగ్గిర జరిగిన లాంచి ప్రమాదానికి సంబంధించి  ఇప్పటి వరకు  ఇద్దరు కవలపిల్లలు తో సహ 14మృత దేహలను బయటకు తీశారు. ఎన్ డిఆర్ ఎఫ్ సిబ్బంది భారీ క్రేన్ సహయంతో లాంచీ ని కూడా బయటకు తీశారు. ఈ ప్రమాదం నుండి నిన్న సాయంత్రం 16మంది సురక్షితంగా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

అధికారులు సేకరించిన వివరాలు ప్రకారం మరో ముగ్గురు అచూకి తెలియాల్సి ఉంది.మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రు. 10లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. అదే విధంగా మృతుల కుటుంబాల పిల్లలకు ఉచిత విద్య ఏర్పాట్లు చేస్తారు.ఇళ్ళు మంజూరు చేస్తారు. ఈ విషయాలను ప్రమాదస్థలాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.నిన్న లాంచీలో ప్రయాణం చేసిన వారంతా 10గ్రామలకి చెందిన వారుగా గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *