కేటిఆర్ సభలోనే రైతు ఆత్మహత్యాయత్నం, విషమం

తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటిఆర్ పాల్గొన్న రైతుబంధు చెక్కుల పంపిణీ సభలో అపశృతి చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండల కేంద్రంలో రాష్ర్ట ఐటి శాఖ మంత్రి కేటిఆర్ రైతు బంధు చెక్కులను పంపిణీ చేస్తున్నారు.

ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ఓగులాపూర్ గ్రామానికి చెందిన ఇల్లందుల కిష్టయ్య అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. తెలంగాణలో నిరుపేద దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా అమలు కాలేదని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు నాలుగేళ్లయినా మూడెకరాల భూమి రాలేదన్న బాధతోనే ఆత్మహత్యాయత్నం చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.

ఆ రైతు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. హుటాహుటిన స్థానికులు, పోలీసులు కిష్టయ్యను ఆసుపత్రికి తరలించారు. కేటిఆర్ సభలో ఈ ఘటన జరగడం సంచలనం రేపింది. ఈ ఘటన తాలూకు మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *