శ్రీదేవి మృతదేహం కుటుంబ సభ్యలకు అప్పగింత

దుబాయ్‌: శ్రీదేవి భౌతికకాయాన్ని కుటుంబీకులకు అప్పగించేందుకు ప్రాసిక్యూషన్‌ క్లియరెన్స్ ఇచ్చింది. ఈ మేరకు సంబంధితపత్రాలను దుబాయి పోలీసులు.. భారత దౌత్య అధికారులు, శ్రీదేవి కుటుంబసభ్యులకు అందజేశారు. అయితే ఎంబాల్మింగ్ ప్రక్రియ పూర్తయ్యాక కుటుంబీకులకు అప్పగించనున్నారు. ఈ విషయాన్ని భారత ప్రతినిధులు ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర్వులు అందించారని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇపుడు మృత దేహాన్ని ఎంబామింగ్ కు పంపిస్తారు. ఆతర్వాత ఇండియాకు ప్రత్యేక విమానంలో పంపిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *