హైదరాబాద్ లో ప్రైవేటు స్కూలు బస్ బోల్తా

హైదరాబాద్  మాదాపూర్ అయ్యప్ప సొసైటీ లో ప్రైవేటు స్కూలు బస్ బోల్తాపడింది.వివరాలు అందాల్సి ఉంది. బస్సు అతి వేగంగా వెళ్తూ ఉండటంతో డ్రైవర్ అదుపు తప్పి, రోడ్ డివైడర్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. డివైడర్ ను ఢీకొన్న బస్సు తలకిందులయి రోడ్డ మీద ఇలా పడిపోయింది. దీనితో చాలా సేపు ట్రాఫిక్ కు అంతారయమేర్పడింది. పోలీసులు వచ్చి వాహానాన్ని క్రేన్ సాయంతో తొలిగించారు. అయితే, బస్సులు పిల్లలెవరూ లేకపోవడంతోబతికి పోయారు. లేకపోతే, ఈ ప్రమాదం చాలా పెద్ద విషాదమయి ఉండేది.