డిసెంబర్ 2 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు

డిసెంబర్ 2 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి.

15 రోజుల పాటు ఈ సమావేశాలు జరగుతాయి. ఈ వి యాన్ని తమ్మినేని సీతారామ్ వెల్లడించారు.

టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏ సభుడైనా పార్టీ మారాలనికుంటే తప్పనిసరిగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందే నని ఆయన అన్నారు.

రాజీనామా చేయకుండా పార్టీ మారితే చర్యలు తప్పవని, సభా నాయకుడిగా సీఎం కూడా ఇదే విషయం చెప్పారని  దానికే తాను కట్టుబడి వున్నానని ఆయన చెప్పారు.

వల్లభనేని వంశీ వైసీపీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తీరాలని సభాపతిగా నా వైఖరి కూడా అదే నని ఆయన అన్నారు.

ఏపీలో శాసనసభ,శాసన మండలి వ్యవస్థలను డిజిటలైజ్ చేస్తున్నామని ఆయన చెప్పారు.

ఇప్పటికే పేపర్ లెస్ డిజిటలైజ్ దిశగా చర్యలు చేపట్టామని  స్పీకర్ చెప్పారు.