దేవిపట్నం వద్ద మరో లాంచీ ప్రమాదం,23 మంది గల్లంతు

ప.గో.జిల్లా పోలవరం మండలం కొండ్రుకోట పంచాయతీ వాడపల్లి/దేవీ పట్నం  వద్ద ప్రయాణికులతో వెళ్తున్న లాంచీ ఈదురు గాలులకు తిరగబడినట్లు సమాచారం. 40 మంది ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం.కొండమొదలు నుంచి రాజమహేంద్రవరం వెళ్తుండగా ప్రమాదంజరిగింది. 5 గురు  ఈదుకుంటు ఒడ్డుకు చేరుకున్నారు. లాంచీలో పెళ్లి బృందం ఉన్నట్లుగా తెలుస్తోంది.మునిగిపోతున్న పడవలోని ప్రయాణికుల ఆర్తనాదాలు విని సమీపంలోని గిరిజనులు నాటు పడవలలో ప్రమాద స్థలానికి చేరుకున్నారు. వారు చాలామందిని కాపాడారని తెలిసింది.  అయితే, మరొక 23 మంది గల్లంతయ్యారని చెబుతున్నారు.  లాంచీ నిర్వాహకుడు ఖాజాని దేవిపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈదురుగాలులు అధికంగా ఉండటం వలన పడవ తిరగబడినట్లుగా సమాచారం. గజఈతగాళ్ళు సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాదం గురించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *