కాంగ్రెస్ లో చేరిన నాగం, గద్దర్ కొడుకు సూర్య కిరణ్

తెలంగాణా ప్రజాగాయకుడు గద్దర్ కుమారుడు సూర్య కిరణ్, ప్రముఖ బిజెపి నాయకులు, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డితో పాటు ఆది శ్రీనివాస్‌ తదితరులు .. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. కొద్ది రోజుల క్రితమే నాగం భాజపాకు రాజీనామా చేశారు. జనార్దన్‌రెడ్డితో పాటు నాగర్‌కర్నూలుకు చెందిన పలువురు నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరారు.ఆది శ్రీనివాస్‌ 2014 ఎన్నికల సందర్భంగా భాజపా తరఫున వేములవాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *