కులాంతర వివాహాలకు పెరిగిన బహుమానం

వైఎస్సార్ పెళ్లికానుక పథకానికి ఆంధ్ర ప్రదేశ్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వివాహం చేసుకున్న వారికి పెళ్లిరోజే వైయస్సార్‌ పెళ్లి కానుకను అందించాలని ఈ రోజు ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం నిర్ణయించింది.   శ్రీరామనవమి పర్వదినం నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుంది.
ఈ పథకం కింద 
• దాదాపు 96,397 మంది లబ్ధిదారులు ఉంటారని అంచనా
• మొత్తంగా రూ.746.55 కోట్లు ఏడాదికి ఖర్చు చేయనున్న ప్రభుత్వం
• ఎస్సీలకు రూ.40వేల నుంచి రూ. 1 లక్షకు పెంపు
• ఎస్టీలకు రూ.50వేల నుంచి రూ. 1లక్ష పెంపు
• బీసీలకు రూ.35 వేల నుంచి రూ.50వేలు పెంపు
• మైనార్టీలకు రూ. 50వేల నుంచి రూ.1 లక్ష పెంపు
• వికలాంగులకు రూ.1 లక్ష నుంచి రూ. 1.5 లక్షలు పెంపు
• భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు రూ. రూ.2వేల నుంచి రూ.1లక్షకు పెంపు
• ఎస్సీ కులాంతర వివాహాలు చేసుకుంటే.. రూ.1.20 లక్షలు
• ఎస్టీ కులాంతర వివాహాలు చేసుకుంటే… .రూ. 1.20లక్షలు
• బీసీ కులాంతర వివాహాలు చేసుకుంటే.. రూ. 70వేలు