అర్ధరాత్రి.. హైదరాబాద్ ఓల్డ్ సిటీ.. ఏమైందో తెలుసా ?(వీడియో)

సంచలనాలకు మారుపేరైన హైదరాబాద్ ఓల్డ్ సిటీలో శనివారం అర్ధరాత్రి మరో సంఘటన జరిగింది. సైదాబాద్ లోని జువైనల్ హోమ్ నుండి శనివారం రాత్రి ఒంటి గంట ప్రాంతంలో 15 మంది బాలురు పరారయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సైదాబాద్ జువనైల్ హోమ్ నుండి 11 మంది బాలలు నిన్న అర్థరాత్రి పరార్… బాలల సదనం గోడ దూకి పక్కనున్న బస్తీ లోకి ప్రవేశించి అక్కడినుంచి పరారైనట్లు తెలుస్తోంది. కొందరు విఆర్ఓ రాములుకు సంబంధించిన మోటార్ సైకిల్ తీసుకొని పరారైనట్లు చెబుతున్నారు. జువైనల్ హోం నిర్వాహకుల ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాలురు పరారైన సిసి పుటేజీ వీడియో పైన ఉంది చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *