పార్లమెంటు వద్ద వైసిపి ఎంపిల నిరసన

ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టంలో పొందుపర్చి అమలు చేయని ‘ప్రత్యేక హోదా’ వంటి అంశాలపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని వైసిపి ఎంపిలు ప్రకటించారు. వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీలు మంగళవారం ఉదయం పార్లమెంట్‌ గేట్‌-1 వద్ద    ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసన తెలిపారు.

ప్రత్యేక హోదా కావాలని నినాదాలుచేస్తూ ప్లకార్డులు ప‍్రదర్శించారు. ఇదే విధంగా పోలవరం ప్రాజెక్ట్‌, విశాఖకు రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలంటూ కూడా వారు నినాదాలు చేశారు. కడప స్టీల్‌ ప్లాంట్‌, దుగరాజపట్నం పోర్టుతో పాటు పోలవరం ప్రాజెక్ట్‌ను 2019 కల్లా పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు.  ఈ నిరసన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, లోక్‌సభ ఎంపీలు మిథున్‌ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్‌, వైఎస్‌ అవినాష్‌ రెడ్డి   పాల్గొన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *