ఈ రోజు ఆంధ్ర ఎలా మండిపోయిందో చూడండి

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ జిల్లాలలో ఈరోజు 3గం. వరకు నమోదుయిన  గరిష్ట  ఉష్ణోగ్రత వివరాలు.
1.శ్రీకాకుళం – 34
2.విజయనగరం – 38
3.విశేఖపట్నం – 34
4.రాజమహేంద్రవరం – 43
5.ఏలూరు- 48
6.విజయవాడ – 44
7.గుంటూరు – 44
8.ఒంగోలు – 43
9.నెల్లూరు – 43
10.చిత్తూరు 41
11.తిరుపతి – 41
12.కడప – 41
13.అనంతపురం – 40
14కర్నూలు – 42
ఈశాన్య ఛత్తీస్ గఢ్ నుండి కోమోరిన్ ప్రాంతం వరకు తెలంగాణ, రాయలసీమ మరియు ఇంటీరియర్ తమిళనాడు మీదుగా 0.9 km ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది.
దీని ప్రభావంతో తెలంగాణలో రాగల మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.  కొన్ని ప్రాంతాలలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఇక కోస్తా ఆంధ్రలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
ఈ రోజు, రేపు కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో తీవ్ర వడగాల్పులు మరియు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాలలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.
ఎల్లుండి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాలలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.
రాయలసీమలో
ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
రాగల మూడురోజులు కర్నూలు, కడప మరియు చిత్తూరు జిల్లాలలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *