బ్రేకింగ్: విజయశాంతికి తృటిలో తప్పిన ప్రమాదం

మహబూబ్‌నగర్ జిల్లాలోని అచ్చంపేటలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్న ప్రచార సభ కూలిపోయింది.  వేదికపై కాంగ్రెస్ సీనియర్ నేతలు భట్టీ విక్రమార్క, విజయశాంతిలతో పాటు అనేక మంది నాయకులు ఆసీనులయి ఉన్నారు. సమావేశం జరుగుతుండగా  ఒక్కసారిగా స్టేజీ కుప్పకూలింది. అప్రమత్తమైన కాంగ్రెస్ నేతలు తృటిలో తప్పించుకున్నారు. స్టేజికి పై కప్పు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. నేతలకు ఎలాంటి గాయలు తగల్లేదు.  స్టేజ్‌పైన ఉన్నవారిని అక్కడున్న అభిమానులు సురక్షితంగా బయటకు తెచ్చారు.

సభలో మాట్లాడేందుకు విజయశాంతి ముందుకు వచ్చి కార్యకర్తలకు అభివాదం చేస్తుండగా ఒక్కసారిగా స్టేజ్  కూలిపోయింది.విజయశాంతి కింద పడిపోయారు. సభలో గందరగోళం నెలకొంది.అప్రమత్తమైన పలువురు మహిళా నేతలు రాములమ్మను పైకి లేపారు. అయితే ఎవరికీ ఏం కాకపోవడంతో నేతలు ఊపిరిపీల్చుకున్నారు. కాగా వేదిక ఏర్పాట్లు సరిగ్గా లేకపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *