ప్రముఖ తెలుగు కవి కమాల్ సాహేబ్ కు ఘన సత్కారం

మాతృభాషాదినోత్సం సందర్భంగా కడజ జిల్లా జమ్మలమడుగు ప్రభుత్వ శాఖా గ్రంధాలయంలో గురువారం రాత్రి గడియారం సాహితీ పీఠం అధ్యక్షుడు డాక్టర్ ఎంఎల్ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.

తొలుత గిడుగు రామమూర్తి పంతులు పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం పట్టణ ప్రముఖ కవి విద్వాన్ కమాల్ సాహేబ్ ను ఘనంగా సత్కరించారు.

కవి రాజు కమాల్ అంటూ స్థానిక కవి సురేష్ బాబు చదివిన కవిత అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పొన్నారి దస్తగిరి ,బండారు శ్రీనివాసులు‌‌ , డాక్టర్ తిప్పాబత్తిని నరసింహులు, దేవదానం , గణపతి, దర్పణం , గురుకుమార్ తదితరులు పాల్గొన్నారు.