చంద్రబాబు 38 ఫారిన్ టూర్లు, ఖర్చు రు 39 కోట్లు: వైసిపి ఏమందంటే…

2014 జూన్ నుంచి ఏప్రిల్ 2019 వ‌ర‌కు ఆనాటి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు,ఆయన మంత్రుల విదేశీ ప‌ర్య‌ట‌న‌లను వైసిపినేతలు వెల్లడించారు. చంద్రబాబు ముఖ్యమయిన పర్యటన వివరాలను వెల్లడిస్తూ వైసిపి మంత్రి గౌతమ్ రెడ్డి, సీనియర్ నాయకుడు కాకాణి గోవర్దన్ రెడ్డి, ఈ పర్యటనల వల్ల సాధించిందేమిటో చంద్రబాబు చెప్పాలని అన్నారు. వివరాలు:
– 2014 న‌వంబ‌రులో సింగ‌పూర్ వెళ్లి ఏపీని టూరిస్ట్ హ‌బ్‌ గా మార్చడం, జిల్లాకో విమానాశ్ర‌యం ఏర్పాటు అని చంద్రబాబు ప్ర‌క‌ట‌న చేశారు.
– 2014 న‌వంబ‌రులో జ‌పాన్ వెళ్లి మ‌న రాష్ట్ర విద్యాల‌యాల్లో జ‌పాన్ భాష నేర్పిస్తామ‌ని, ఉద్యోగ క‌ల్ప‌న ప్ర‌క‌ట‌న చేశారు.
-2015 జ‌న‌వ‌రిలో దావోస్ వెళ్లి బుల్లెట్ ట్రైన్ తెస్తామని, మ‌లేషియా త‌ర‌హాలో బుద్ధిజం టూరిజం అభివృద్ధి చేస్తామని చంద్రబాబు ప్ర‌క‌ట‌న చేశారు.
-2015 ఏప్రిల్‌లో చైనా వెళ్లి షాంఘై త‌ర‌హాలో అమ‌రావ‌తి నిర్మిస్తామ‌న్నారు , ఎల‌క్ట్రానిక్ హ‌బ్ ఏర్పాటు చేసి సోలార్ ప‌రిశ్ర‌మ‌లు తెస్తామ‌ని ప్రకనటచ చేశారు.
– 2015 జులైలో జ‌పాన్ వెళ్లి.. టోక్యోలా అమ‌రావ‌తి నిర్మిస్తామ‌ని అన్నారు. ఇండ‌స్ట్రియ‌ల్ టౌన్ షిప్ క‌డ‌తామ‌ని చెప్పారు. విశ్వ‌న‌గ‌రంగా అమ‌రావ‌తి ని చేస్తామని చంద్రబాబు ప్ర‌క‌ట‌న చేశారు. వివిధ రంగాల్లో జ‌పాన్ కంపెనీలు పెట్టుబ‌డులు పెట్ట‌డానికి సిద్ధంగా ఉన్నాయ‌ని వాటికోసం ఇండ‌స్ట్రియ‌ల్ టౌన్ షిప్ ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న చేశారు.
– 2015 సెప్టెంబ‌రులో సింగ‌పూర్ వెళ్లారు.విశ్వ‌న‌గరంగా అమ‌రావ‌తి నిర్మిస్తామ‌న్నారు. రాజ‌మండ్రిలో సోలార్ ప‌వ‌ర్ ప్లాంట్‌,రూ.2,000 కోట్ల‌తో టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్ర‌క‌ట‌న చేశారు.
‍-2016 మార్చిలో లండ‌న్ ప‌ర్య‌ట‌న‌లో అమ‌రావ‌తి నిధుల స‌మీక‌ర‌ణ‌కు లండ‌న్ స్టాక్ ఎక్చేంజి అంగీక‌రించింద‌ని చంద్ర‌బాబు గొప్పగా చెప్పారు.
– 2016లో చైనా ప‌ర్య‌ట‌న చేసి మ‌ళ్లీ రాష్ట్రానికి బుల్లెట్ ట్రైన్ తెస్తామ‌ని మళ్లీ చంద్ర‌బాబు అన్నారు. 10వేల కోట్ల‌తో గ్యాస్ ఆధారిత ఎరువుల క‌ర్మాగారం కార్గో హ‌బ్ గా కృష్ణ‌ప‌ట్నం, విశాఖ చేస్తామ‌ని చంద్ర‌బాబు ప్రకటన చేశారు
– 2016 జులైలో ఖ‌జ‌కిస్తాన్ వెళ్లారు. ఖ‌జ‌కిస్తాన్‌ రాజధాని అస్టానా లాగా అమ‌రావ‌తిని నిర్మిస్తామ‌ని చాలా గొప్పగా చెప్పారు.
– 2016 ర‌ష్యాలో కూడా పర్యటించారు. రాష్ట్రంలో మెరైన్ యూనివర్శిటీ తెస్తామని చెప్పారు. అమ‌రావ‌తికి మాస్కో స‌హ‌కారం తీసుకుంటామ‌ని చంద్రబాబు ప్ర‌క‌ట‌న చేశారు.
– 2017 జ‌న‌వ‌రిలో శ్రీ‌లంక వెళ్లి శ్రీ‌లంక ద్వీపాల త‌ర‌హాలో భ‌వానీ ద్వీపాన్ని అభివృద్ధి చేస్తామ‌ని చంద్ర‌బాబు తెలిపారు.
– 2017 జ‌న‌వ‌రిలో దావోస్ వెళ్లారు. సాంకేతిక ప్ర‌గ‌తికి మైక్రోసాఫ్ట్ స‌హ‌కారం తీసుకుంటామ‌ని అన్నారు. ఫిన్‌టెక్ వ్యాలీలా ఏపీ త‌యారు చేస్తామ‌ని చంద్ర‌బాబు అన్నారు.
– 2017లో అమెరికా వెళ్తే విశాఖ‌కు టెంపుల్ ట‌న్‌, 28 ఐటీ సంస్థ‌లు, మెగా సీడ్ ప్రాజెక్ట్‌,
– 2017 అక్టోబ‌రులో లండ‌న్ వెళ్లిన‌ప్పుడు రాష్ట్రానికి ఏరో సిటీ, న‌లంద యూనివర్శిటీ, ఆర్గానిక్ పుడ్ ఇండ‌స్ట్రీ తెస్తామ‌ని అన్నారు.
– దుబాయ్ వెళ్లిన‌ప్పుడు ఎమిరేట్స్ సంస్థ‌కు హ‌బ్‌గా ఏపీని తీర్చిదిద్దుతాం అని ప్ర‌క‌టించారు. 5 బిలియ‌న్ డాల‌ర్ల ఏవియేష‌న్ సిటీ ఏర్పాటు అని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు.
-2017 డిసెంబ‌రులో ద‌క్షిణ కొరియాకు వెళ్లి ఏపీ రెండో రాజ‌ధాని అని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. అనంత‌లో ఫ్రెండ్లీ కాంప్లెక్స్‌, కొరియా సిటీ తెస్తామ‌ని మొత్తం 3వేల కోట్లు అని చంద్రబాబు ప్ర‌క‌ట‌న చేశారు.
-2018 జ‌న‌వ‌రిలో దావోస్ వెళ్లి పెట్టుబ‌డులు పెట్ట‌మ‌ని విజ్ఞ‌ప్తి చేశారు.
-త‌ర్వాత దుబాయ్‌లో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న చేశారు. ఫినిక్స్ ఆధ్వ‌ర్యంలో అతిపెద్ద రైస్ మిల్లు వ‌స్తోంద‌ని అన్నారు.
ఇలా చంద్ర‌బాబు విదేశాల్లో ప‌ర్య‌టించడానికి రు. 39 కోట్లు ఖ‌ర్చయింది. దీనివ‌ల్ల రాష్ట్రానికి క‌లిగిన ల‌బ్ధి ఏమిటని మంత్రి గౌతం రెడ్డి,ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి ప్రశ్నించారు.

(ఫోటో Asianet Newsable సౌజన్యం)