ఇంటర్ బోర్డు నిర్వాకంపై కాంగ్రెస్ రవళి సీరియస్ (వీడియో)

విద్యార్థుల జీవితాలతో ఇంటర్ బోర్డు, తెలంగాణ సర్కారు చెలగాటమాడుతున్నాయని తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిథి రవళి కూచన రెడ్డి విమర్శించారు. 16 మంది ఎంపీల మీద ఉన్న శ్రద్ధ 16 మంది ఇంటర్ విద్యార్థుల ప్రాణాల మీద టిఆర్ఎస్ సర్కారుకు లేకపోవడం బాధాకరమన్నారు.

ఇంటర్ బోర్డు, తెలంగాణ సర్కారు తీరు వల్లే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. లక్షల రూపాయల ఫీజులు చెల్లించిన తల్లిదండ్రులు బిడ్డలు ప్రాణాలు తీసుకుంటుంటే కుంగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ సర్కారు కార్పొరేట్ కాలేజీలతో కుమ్మక్కయిందని ఆరోపించారు. కమిషన్ల కోసమే ఇంటర్ మూల్యాంకనం బాధ్యతలు కట్టబెట్టారని విమర్శించారు. ఇంకా రవళి ఏమన్నారో కింద వీడియోలో ఉంది చూడండి.

 

ఈ ట్రెండింగ్ న్యూస్ చదవండి…

https://trendingtelugunews.com/congress-mla-gandra-venkataramana-reddy-meets-ktr/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *