చంద్రబాబు దీక్ష మీద కత్తులు నూరుతున్న బిజెపి

(మానేపల్లి రాంబాబు)

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 20 చేయాలనుకుంటున్న ఒక రోజు నిరాహార దీక్షను బిజెపి తప్పు పట్టింది. బిజెపి అసెంబ్లీ శాసన సభా పక్ష నాయకుడు విష్ణుకుమార్ రాజు చంద్రబాబు మీద బాాగా దుమ్మెత్తి పోశారు. ఒకపుడు ఆయనే  టిడిపి వాళ్లకంటే చంద్రబాబు ను వెనకేసుకొచ్చేశారు. దీనిని చూసి  తెలుగుదేశం ఎమ్మెల్యేలే   ఇబ్బంది పడే వారు. ఇపుడు రాజు చంద్రబాబు మీద కత్తి నూరు తున్నారు. ఈ రోజు విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ఏదో రాజకీయ కుట్రకు పూనుకుంటున్నాడని అన్నారు. చంద్రబాబు స్టేట్ స్పాన్సర్డ్ ఉద్యమాలు జరపాలని చూస్తున్నడని, ఇలా ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుుకుని ప్రజలును సమీకరించడం సబబు కాదని అన్నారు.

‘‘నేను చెబితే రాష్ట్రంలో కేంద్రం వాహనాలు తిరగవు అన్నారు.అంటే విమానాలు, రైళ్లు, షిప్పలను అపుతారా?’’ అని అంటూ కావాలని రాష్ట్రంలో చంద్రబాబు చిచ్చుపెడుతున్నారని, చంద్రబాబు నోరు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడాలని విష్ణు కుమార్ రాజు హెచ్చరించారు.

ఇసుక కుంభకోణం ద్వారా టీడీపీ నేతలు కోట్లాది రూపాయలు కొల్లకొడుతున్నారని ఆరోపిస్తూ, ప్రభుత్వం చేతిలో ఉందని 30 తేదీన కార్యక్రమం చేస్తున్నారని అన్నారు.

స్వచ్చందంగా టీడీపీ పిలిస్తే ఏపీలో వచ్చే నాధుడే లేడని కూాాడా రాజు అన్నారు.

విష్ణుకుమార్ రాజు ఇంకా ఏమన్నారంటే…

*పాకిస్తాన్ మోస్ట్ వాంటెడ్ చంద్రబాబు

*వేరే దేశాలకు వెళ్లి దేశ ప్రధాని ని నిందించే సంస్కృతి ఎక్కడిది

*దేశ ప్రధాని మీద వేరే దేశాల్లో విమర్శలు చేశారంటే దేశంలో ప్రతి ఒక్కరినీ అవమానించి నట్టే.వేరే దేశాలతో రహస్య ఒప్పందం ఉందా

*ఇదేనా 40 ఏళ్ల రాజకీయ అనుభవం

*రాజకీయ కుట్ర కోసమే చంద్రబాబు ఇదంతా చేస్తున్నారు

*జివొ జారీ చేసి విద్యార్థులను సైతం ర్యాలీ కార్యక్రమాల్లో కి లాగుతున్నారు.

*గంటా శ్రీనివాసరావు  ఎపుడు ఏ పార్టీ లో ఉంటాడో తెలీదు.. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వ్యక్తి గంటా.రాజకీయ కుట్రలకు గంటా మేధావి

*పట్టిసీమ మీద విచారణ చేసే ధైర్యం చంద్రబాబు కు  లేదు

*రాష్ట్రంలో అవినీతి తాండవిస్తోంది..అవినీతిని అడ్డుకోవడానికి చర్యలు తీసుకోమంటే బాబు పట్టించుకోరు

*ఓటు బాంక్ రాజకీయం తప్ప బాబు ఢిల్లీ లో ఏమీ చేయరు..ఫోటో షూట్ తప్ప

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *