టిడిపి దేవినేని ఉమ నెల తక్కువ వ్యక్తి : నిప్పులు చెరిగిన ఆంధ్ర మంత్రి

ఆంధ్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. టిడిపి నేత దేవినేని ఉమా మీద అనిల్ నిప్పులు చెరిగారు. ఆయన మాటల్లో…
జీవో 203 పై ఏపీ ప్రభుత్వాన్ని వివరణ కోరిన కృష్ణా వాటర్ బోర్డుకు వివరణ ఇస్తాం.
వివరణ ఇచ్చేందుకు ప్రాసెస్ జరుగుతోంది.
పోలవరం ప్రాజెక్టుపై దేవినేని ఉమా పదే పదే అబద్ధాలు చెబుతూనే ఉన్నాడు
టిడిపి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టులో కేవలం ముప్పై శాతం పనులు మాత్రమే చేసింది.
పోలవరంలో ఒక భాగానికి సంబంధించిన పనులు మాత్రమే టిడిపి చేసింది.
మొత్తం ప్రాజెక్టులో చూస్తే కనీసం 30 శాతం కూడా చేయలేదు.
R&R లో లక్షకు పైగా sc,st,bc పేద ప్రజలు ఉన్నారు టీడీపీ హయాంలో ఒక్క ఇళ్ళు ఆయన కట్టించారా?
కాపర్ డ్యాం పెంచి పేదలు ఇళ్ళు ముంచి వారికి నష్టం చేసింది.
R&R కోసం మాట్లాడే నైతిక హక్కు టీడీపీ కి లేదు.
కానీ పోలవరం ప్రాజెక్టు పనులు 70 శాతం చేసామని అబద్ధాలు చెబుతూనే ఉన్నారు.
టిడిపి నాయకులు దేవినేని ఉమాకు కనీస పరిజ్ఞానం కూడా లేదు. బుర్ర తక్కువ.. నెల తక్కువ వ్యక్తి.
పోతిరెడ్డిపాడుపై తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఏమిటో ఇప్పటికీ చెప్పడం లేదు.