చంద్రబాబు ఢిల్లీ హడావిడి వెనక రహస్యం ఇదే : విష్ణువర్ధన్ రెడ్డి

(ప్రశాంత్ రెడ్డి)

మే 23న ఫలితాల అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు తెలుగుదేశం పార్టీ పథకాలు తయారుచేస్తున్నదని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలను అలర్లకు రెచ్చగొడుతున్నారని తెలంగాణ బిజెపి అధికార ప్రతినిధి ఎస్ విష్ణువర్దన్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయం మీద నిఘా వేసి వుంచాలని ఆయన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారికి విజ్ఞప్తి చేశారు.

ఈ రోజు హైదరాబాద్ బిజెపి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజెపికి వ్యతిరేకంగా ఒక ఫ్రంటు కూడగట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను విష్ణువర్దన్ రెడి తీవ్రంగా ఖండించారు. విలేకరుల సమావేశంలో తెలంగాణ ఉపాధ్యక్షుడు గోపాల్ జీ, స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఇన్ చార్జి విక్రమ్ రెడ్డి కూడా పాల్గొన్నారు

‘బిజెపికి స్పష్టమయిన మెజారిటీ వస్తున్నదని సర్వేలు చెప్పాయి. 48 గంటలలో ఫలితాలు వస్తున్నాయి. మోదీ మళ్లీ ప్రధాని కాబోతున్నారు. అయితే, కొన్ని ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు దేశ ప్రజల తీర్పును ఓర్చుకోలేకపోతున్నాయి. వారు రాజకీయ అస్థిరతను కోరుతున్నారు. వాళ్లింకా దింపుడు కళ్లెం అశతో ఉన్నారు. ఇందులో చంద్రబాబు నాయుడు ముందున్నాడు,’ అని ఆయన విమర్శించారు.

ఇది ఉత్తుత్తి హడావిడి మాత్రమే నేని అంటూ ప్రజల డబ్బుతో ఇలా చంద్రబాబు నాయుడు విమానాలేసుకుని ఫ్రంటు కోసం రాష్ట్రాలు తిరగడం ప్రజాధనం దుర్వినియోగం చేయడం, అధికార దుర్వినయోగం అవుతుందని ఆయన విమర్శించారు.

‘బిజెపికి సొంతమెజారిటీ 273 సీట్లు పైబడే వస్తున్నాయి. అయినా ఎన్డీయే తో ప్రభుత్వం ఏర్పాుచేస్తారని ప్రధాని మోదీ,పార్టీ అధ్యక్షుడు షా చెప్పారు. బిజెపి తర్వాత  రెండో పెద్ద పార్టీ అర్హత కాంగ్రెస్ కు వస్తుంది. కాంగ్రెస్ పార్టీ కంటే చంద్రబాబే ఎక్కువ హడావిడి చేస్తున్నారు. ప్రజల డబ్బుతో చక్కర్లు కొడుతున్నారు . విహారయాత్రలగా ప్రజల సొమ్ము వాడుతున్నారు. మాయావతి చంద్రబాబు సమావేశానికి రానని చెప్పగానే నిన్న విమానాన్ని కలకత్తాకు మళ్లించాడు,’ అని ఆయన అన్నారు.

‘చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నపుడు ఎన్నోతప్పులు చేశాడు. వాటి మీద రేపు రాబోయే కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. విచారణ జరిపిస్తుంది. ఇపుడు మోదీ కి వ్యతిరేకంగా ఫ్రంటు కట్టేందుకు తాను తిరిగినందునే ప్రతీకరాంగా తన మీద కేసులుపెడుతున్నారు, విచారణ అంటున్నారని అనబోతున్నాడు. చంద్రబాబు పర్యటలన వెనక రహస్యంఇదే,’ నని విష్ణువర్దన్ రెడ్డిఅన్నారు.

చంద్రబాబు ను చూసి జనం పారిపోతున్నారని ఆయన అన్నారు. ‘ స్టాలిన్ ఎందుకు పారి పోయాడు. మీ ముఖం చూసి ఎందుకు భయపడుతున్నాడు. మీ ఢిల్లీ మీటింగ్ కు కుమార స్వామిఎందుకు రాలేదు. నవీన్ పట్నాయక్, మాయావతి ఎందుకురాలేదు చంద్రబాబు వలలేసి పట్టకున్నా వారు రారు. 23 తర్వాత చంద్రబాబు ఒక్కరే మిగులుతారు. ఇక ఆయనకు మిగిలింది కాంగ్రెస్ లో విలీనం కావడమే,’ అని ఆయన అన్నారు. చంద్రబాబు తన తీరు వల్ల వినోదం పంచుతున్నారే తప్ప ఏమీ సాధించలేరని వ్యాఖ్యానించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *