ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం

ఎన్నికలు దగ్గర పడుతున్నవేళ ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఓటర్లను ఆకట్టుకోవడానికి అనేక వ్యూహాలు పన్నుతోంది. వృధాప్య పింఛన్ పెంచడం, పసుపు కుంకుమ, దళిత క్రైస్తవులను ఎస్సీలలో చేర్చాలని కేంద్రానికి లేఖ పంపడం వంటి సంచలన నిర్ణయాలు తీసుకున్న టీడీపీ సర్కార్ మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది.

సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో అనేకమందిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ ఎత్తివేసింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు హోంశాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీకి సూచించింది. ఏపీలో వివిధ పోలీస్ స్టేషన్లలో ఉద్యమకారులపై నమోదైన కేసులను ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి ఏఆర్ అనురాధ, డీజీపీకి ఆదేశాలు జారీ చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *