జగన్ ఇచ్చాపురం సభలో 20 విశేషాలు ఇవే

జగన్ చారిత్రాత్మక పాదయాత్ర బుధవారం ఇచ్చాపురంలో ముగిసింది. పాదయాత్ర ముగింపు సమయంలో జగన కీలకమైన విషయాలు వెల్లడించారు. వైయస్ జగన్ ప్రసంగంలోని 20 ముఖ్యాంశాలు కింద ఉన్నాయి చదవండి.

1) ఇచ్చాపురం సభలో జగన్ ను ఉద్దేశించి కార్యకర్తలు సిఎం… సీఎం.. అంటూ నినాదించారు. ఇన్ని వేల కిలోమీటర్ల పాదయాత్రలో.. ప్రజల గుండె చప్పుడును.. నా గుండె చప్పుడుగా మార్చుకున్నాను.

2) 600 హామీలు ఇచ్చి.. ప్రతీ కులాన్నీ ఎలా మోసం చేయవచ్చు అన్న దానిలో పీహెచ్ డీ చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు

3) రాష్టంలో కరువు పరిస్థితులు ఉంటే.. రెయిన్ గన్ ల పేరుతో చంద్రబాబు నాయుడు సినిమా చూపించారు.. అంటూ అనంతపురం జిల్లాకు చెందిన రైతు శివన్న యథార్థ గాథ వినిపించిన జగన్ గారు.

4) జాతీయ రాజకీయాల పేరుతో కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తిరుగుతారు కానీ.. మన రాష్ట్రంలో రైతన్నల కష్టాలను తీర్చాలన్న ధ్యాసే లేదు చంద్రబాబుకు.

5) రైతు ఆదాయంలో మన రాష్ట్రం రైతులు దేశంలోనే 28 వ స్థానంలో, రైతు అప్పుల్లో మాత్రం 2వ స్థానంలో ఉంటే.. గ్రోత్ రేట్ లో నెంబర్ 1 అంటూ చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు. అందుకే చంద్రబాబును నమ్మం బాబూ.. అని రైతులు, ప్రజలు అంతా అంటున్నారు.

6) పొదుపు సంఘాలకు చెందిన అక్కచెల్లెమ్మల రుణాలు చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి రూ. 14,2014 కోట్లు ఉంటే… ఇప్పుడవి వడ్డీలు పెరిగిపోయి రూ. 22,174 కోట్లకు చేరాయి. సున్నా వడ్డీ రుణాలకు కూడా బాబు ఎగనామం పెట్టాడు.

7) బాబు వచ్చాడు.. కానీ జాబు రాలేదు.. ఉన్న జాబులను ఊడగొడుతున్నాడు.. అని నిరుద్యోగ యువత అంటున్నారు. రాష్ట్ర విభజన సమయంలో 1.42 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే.. ఇప్పుడవి 2.40 లక్షలకు పెరిగినా.. ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. ప్రతి ఇంటికీ రూ. 2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానని ఎన్నికలకు ముందు చెప్పి.. ఇప్పుడు ఎన్నికలకు మూడు, నాలుగు నెలల ముందు, అదీ కొద్ది మందికే వెయ్యి ఇస్తానంటున్నాడు. 20 లక్షల కోట్ల పెట్టుబడులు.. 40 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటున్నాడు. అన్నీ అబద్ధాలే. జాబు రావాలంటే.. బాబు పోవాలి.. అందుకే యువత నిను నమ్మం బాబూ.. అంటున్నారు.

8) చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక.. అక్షరాలా 6 వేల ప్రభుత్వ స్కూళ్ళు మూసేశాడు. ఎస్సీ, ఎస్టీల హాస్టళ్ళు మూసేశాడు. కవిటి మండలంలో ఓ జూనియర్ కాలేజీలో కనీసం బాత్ రూమ్ లు కూడా లేవని ఓ విద్యార్థిని చెప్పింది.

9) రాష్ట్రంలో 23 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్న బడుల్లో టీచర్లు లేరు. పుస్తకాలు ఇవ్వటం లేదు.. ఈవిధంగా ప్రభుత్వ స్కూళ్ళను నిర్వీర్యం చేస్తూ.. నారాయణ, చైతన్య సంస్థలను మాత్రం పెంచుతున్నారు చంద్రబాబు.

10) జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా నడుస్తోంది. రేషన్ కార్డు నుంచి మరుగుదొడ్డి వరకూ ఏది కావాలన్నా.. లంచం.. లంచం. గ్రామాల్లో భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెన్షన్ కావాలంటే ఏ పార్టీ అని అడుగుతున్నారు. పెన్షన్ కావాలంటే బతికి ఉన్నా.. సర్టిఫికెట్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి.

11) చంద్రబాబు నాయుడు నోటికి-మెదడుకు కనెక్షన్ తెగింది. అందుకే నోటికేది వస్తే అది మాట్లాడుతున్నాడు. ఎన్నికలొచ్చేటప్పటికీ భయం పట్టుకుంది. ఆదరణ-2 అని, కొత్త ఇళ్ళు, పెన్షన్లు.. మరొకటి అని డ్రామాలు ఆడుతున్నాడు.

12) ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తున్నాడు. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరిగా కొనుగోలు చేసి, అందులో నలుగుర్ని మంత్రుల్ని చేశాడు.

13) ప్రతి పథకం ప్రతి పేదవాడి ఇంటికి చేరాలి. ఆ దిశగా పాలన ఉండాలి. ఆ పేదవాడు ఏ పార్టీ, ఏ కులం, మతం, అనేది అడ్డు కాకూడదు. వ్యవస్థలో మార్పు దిశగా మనమంతా అడుగులు వేయాలి.

14) 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ను 25 జిల్లాల ఆంధ్రప్రదేశ్ గా మారుస్తాం. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్నీ ఒక జిల్లాగా చేస్తాను. ఈ విధంగా జవాబుదారీతనం పెంచుతాం. కలెక్టర్లు ప్రజలకు మరింత చేరువ చేస్తాం.

15) ప్రతి గ్రామంలోనూ గ్రామ సెక్రటేరియేట్ ను తీసుకొస్తాం. స్థానికులకే 10 మందికి ఉద్యోగాలు ఇస్తాం.  ప్రతి 50 ఇళ్ళకు ఒకరికి గ్రామ వాలంటీయర్ గా తీసుకొని ఉద్యోగం ఇస్తాం. వీరికి రూ. 5 వేలు జీతం ఇస్తాం.

16) రైతులకు పెట్టుబడులు తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటాం. పగటి పూటే 9 గంటలపాటు ఉచితంగా కరెంటు ఇస్తాం. ప్రతి రైతు ఆదాయం పెంచడం కోసం.. బ్యాంకు రుణాలపై వడ్డీ లేకుండా సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తాం. మే నెలలోనే రైతన్నకు పెట్టుబడి కోసం ఏడాదికి రూ. 12,500 ఇస్తాం. గిట్టుబాటు ధరల కోసం రూ. 3000 కోట్లతో ధరల స్థిరీకరణ తీసుకొస్తాం.

17) ఒక్కసారి అధికారంలోకి వస్తే 30 ఏళ్ళు పాలించాలన్నది నాకున్న ఆశ. నా పాలన చూసి.. నాన్న ఫోటోతోపాటు నా ఫోటో కూడా ప్రతి ఇంట్లో ఉండాలన్నది నా ఆశ.

18) నవరత్నాలను ప్రతి ఇంటికీ చేర్చండి. నవరత్నాల మేలును ప్రతి ఒక్కరికీ చెప్పండి. అవి జనంలోకి తీసుకెళితే.. చంద్రబాబు నాయుడు ఎంత డబ్బులిచ్చినా.. ఓటు వేయరు.

19) ఆరు నెలలు కలిసి ఉంటే. వారు వీరు.. వీరు వారవుతారు. ఈ 14 నెలలు పేదవాడితోనే ఉన్నాను. వారి కష్టాలు వింటూనే.. వారికి భరోసా ఇస్తూనే నడిచాను.

20) ప్రజా సంకల్ప యాత్ర ఇంతటితో ముగుస్తున్నా.. పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *