విజయ్ కుమార్ IPS… సూపర్ హిట్ డైలాగ్ ఏమిటో తెలుసా?

జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం లెఫ్టినెంట్ గవర్నర్‌గా రిటైరయిన 1975 బ్యాచ్ ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్ నియామకానికి రంగం సిద్ధమయినట్లు వార్తలొస్తున్నాయి.
విజయ్ కుమార్ ఐపిఎస్ అనగానే ఒక ఫేమస్ డైలాగ్ గుర్తుకొస్తుంది. ఆయన కెరీర్ చూస్తే ఆయన ట్రిగ్గర్ మీద నుంచి వేలెపుడైనా తీశాడా అని అనుమానం వస్తుంది. ఆయన కన్నుపడితే ఫినిషే. అదే విధంగా ఆయన మీద మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు కూడా ఉన్నాయి. హక్కులసంఘాల వాళ్లు చేస్తున్న ఆరోపణలకు రిప్లైగా ఆయన ఈ డైలాగ్ వదిలారు.
విజయ్ కుమార్ 100 శాతం పోలీసని ఈ డైలాగుతో అర్థమవుతుంది. పోలీసు చేతిలో గన్ ఉండేది కాల్చేందుకే గాని అభరణంగా కాదు (Policemen do not carry guns as ornaments)  అని హక్కుల సంఘాల వాళ్లు ఆరోపించినపుడు ఆయన చేసిన సంచలన వ్యాఖ్య చేశారు.
తమిళనాడు క్యాడర్ చెందిన విజయ్ కుమార్ ఇపుడు గవర్నర్ సత్యపాల్ మాలిక్ కు సలహాదారుగా ఉంటున్నారు.
ఎన్ కౌంటర్ల స్పెషలిస్టుగా పేరున్న విజయకుమార్ 370 రద్దు తర్వాత ఏర్పడిన ఉద్రిక్త కశ్మీర్ కు లెఫ్టినెంట్ గవర్నర్ గా సరౌన వ్యక్తి అని భావించిఆయన కుప్రమోషన్ ఇస్తున్నట్లు సమాచారం.
జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ జనరల్ గా తెలంగాణ గవర్నర్ ఇఎస్ ఎల్ నరసింహన్ ను నియమిస్తున్నారని కొద్ది రోజుల కిందట ప్రచారం జరిగింది. అయితే, ఈ పదవి రేసులో విజయ్ కుమార్ ముందున్నారని చెబుతారు. నరసింహన్ కూడా ఐపిఎస్సే.

ఇది కూడా చదవండి:

అమెరికా-చైనా ట్రేడ్ వార్… ఇంతకీ ఆ గొడవ ఏంటి?
2004లో శాండల్ వుడ్ స్మగ్లర్ వీరప్పన్ ను హతమార్చేందుకు ఏర్పాటుచేసిన టాస్క్ ఫోర్స్ కు నాయకత్వం వహించి విజయ్ కుమార్ జాతీయ వార్త అయ్యారు. తర్వాత ఆయన మరొక పేరుమోసిన ఆపరేషన్ పూర్తి చేశారు.
2011 బెంగాల్ మిడ్నపూర్ అడవుల్లో మావోయిస్టు మల్లోజు వెంకటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ ని హతమార్చడంలో కూడా ఆయన కీలకపాత్ర ఉందని చెబుతారు. అపుడు విజయ్ కుమార్ సిఆర్ పిసి డైరెక్టర్ జనరల్ గా ఉన్నారు. ఇలా ఫారెస్టు స్మగ్లర్లను, మావోయిష్టులను వేటాడంలో మంచి ప్రావీణ్యం సంపాదించారు.
చెన్నై పోలీసు కమిషనర్ (2001-2003) గా ఉన్నపుడు కూడా ఆయన చాలా మంది మాఫియా డాన్లను మట్టుపెట్టారని చెబుతారు.
 జమ్ము కశ్మీర్ లో గతంలో పని చేసిన అనుభవం ఇపుడు ఆయనకు బాగా తోడవుతూ ఉంది. పూర్వం 1998లో ఆయన జమ్ము కశ్మీర్ లో బిఎస్ ఎఫ్ ఇన్స్ పెక్టర్ జనరల్ గా పని చేశారు.
స్మగ్లర, మావోయిస్టులతో తీవ్రవాదుల అణచివేతలో కూడా ఆయనకు బాగా అనుభవం ఉండటంతో జ.క మొదటి లెఫ్ట్ నెంట్ గవర్నర్ పదవి రేసులోఅందరికంటే ముందున్నారని తెలిసింది.
గతంలో ఐబి చీఫ్ గా పనిచేసిన దినేశ్వర్ శర్మ కూడా ఈ రేసులో ఉన్నారు. ఈ పదవి కోసం వినబడుతున్న పేర్లన్నీ కూడా ఐపిఎస్ వారివే. రెండురోజులుగా ఆయన నియామకం సోషల్ మీడియాల్ వైరలవుతూ ఉంది.