కరోనా వైరస్ సోకి అమెరికా తెలుగు జర్నలిస్టు బ్రహ్మ మృతి

అమెరికా తెలుగు వాళ్లందరిని విషాదంలో ముంచి అక్కడి సీనియర్ తెలుగు జర్నలిస్టు కంచిబొట్ల బ్రహ్మ కరోనా వైరస్ సోకి మరణించారు.అమెరికా తెలుగు కమ్యూనిటీలో బాగా పేరున్న జర్నలిస్టు.
ఆయన వయసు 66 సంవత్సరాలు. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలున్నారు. కోవిడ్-19 రోగ లక్షణాలుకనిపించడంతో మార్చి 28 న ఆయనను లాంగ్ ఐలండ్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్సకు జబ్బు లొంగిరాలేదు. ఆయన ఏప్రిల్ 6 న మరణించారు.
చాలా కాలం ఆయన యుఎన్ ఐ కి న్యూయార్క్ నుంచి, ఐక్యరాజ్యసమితి నుంచి విలేకరిగా పని చేశారు.ఈ మధ్య కాలంలో ఆయన భారతీయులకు చెందిన ది ఇండియన్ పానొరామకు,సౌత్ ఏసియన్ టైమ్స్ కు పనిరాస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆయన మృతికి సంతాపం తెలిపారు. బ్రహ్మ కంచిబొట్ట కోవిడ్ -19 తో మృతిచెందడం దురదృష్టకరమని ప్రధాని వ్యాఖ్యానించారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు బ్మహ్మ మృతిపట్ల సంతాపం తెలిపారు.